విద్యార్థినిపై ఓ జూనియర్ లెక్చరర్ లైంగికదాడి
ABN , First Publish Date - 2021-05-14T17:58:43+05:30 IST
తిరునెల్వేలిలోని ఓ కాలేజీ విద్యార్థినిపై ఓ జూనియర్ లెక్చరర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. శీతలపానీయంలో మత్తుపదార్థం కలిపి విద్యార్థినికి ఇచ్చి
పోలీసులకు ఫిర్యాదు - పరారీలో నిందితుడు
చెన్నై/అడయార్: తిరునెల్వేలిలోని ఓ కాలేజీ విద్యార్థినిపై ఓ జూనియర్ లెక్చరర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. శీతలపానీయంలో మత్తుపదార్థం కలిపి విద్యార్థినికి ఇచ్చి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. దీనిపై బాధిత విద్యార్థిని పోలీసు కమిషనరుకు లిఖి తపూర్వకంగా ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి కామాంధుడి కోసం గాలించగా, అతను పరారీలో వున్నాడు. ఈ జూనియర్ లెక్చరర్ ఇటీవల తనపుట్టినరోజున కేక్ కట్టింగ్ సెలబ్రేషన్స్ జరుపుకోగా, దానికి సంబంధించిన వీడియో ఒకటి లీకై, చర్చనీయాంశమైంది. ఈ వీడియో తర్వాత స్థానిక ప్రజలను బెదిరించినట్టుగా పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ఆన్లైన్ క్లాస్పేరుతో ఆ కాలేజీకి చెందిన ఓ విద్యార్థిని ఫోన్ నంబరు తీసుకున్న ఆ లెక్చరర్ ప్రతి రోజూ ఫోన్ చేస్తూ లేనిపోని విషయాల గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఈ క్రమంలో లాక్డౌన్కు ముందు ఆ విద్యార్థిని తన సొంతూరు వెళ్ళేందుకు బస్టాండుకు వచ్చి బస్సు కోసం ఎదురుచూస్తున్న సమయంలో అతడు ఆ విద్యార్థినిని బలవంతంగా కారులో ఎక్కించుకుని ఆమె సొంతూరుకు బయలుదేరాడు. మార్గమధ్యలో ఉన్న ఒక ఆలయం వద్ద కారు ఆపి.. శీతల పానీయం ఇచ్చి లైంగిక దాడికి తెగబడ్డాడు. కొంతసేపటికి ఆ విద్యార్థిని స్పృహలోకి వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని తలచుకుని బోరున విలపిం చింది. అయితే, అతడు ఆ విద్యార్థినిని పెళ్ళిచేసు కుంటానని నమ్మించి ఆమెను తీసుకొచ్చి బస్టాండులో వదిలివెళ్ళాడు. అంతేకాకుండా, ఆ విద్యార్థిని అర్థనగ్నంగా వీడియో తీసి బెదిరిస్తుండడంతో అతని వేధింపులు భరించలేని ఆ యువతి... పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.