మంత్రి అప్పలరాజుపై పీఎస్లో ఫిర్యాదు
ABN , First Publish Date - 2021-05-11T05:21:17+05:30 IST
నందికొట్కూరు, పగిడ్యాల మండలాల టీడీపీ కన్వీనర్లు ఓబుల్రెడ్డి, పలుచాని మహేశ్వరరెడ్డి మంత్రి అప్పలరాజుపై సోమవారం నందికొట్కూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
నందికొట్కూరు,
మే 10: నందికొట్కూరు, పగిడ్యాల మండలాల టీడీపీ కన్వీనర్లు ఓబుల్రెడ్డి,
పలుచాని మహేశ్వరరెడ్డి మంత్రి అప్పలరాజుపై సోమవారం నందికొట్కూరు
పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ ఎన్440కె అనే కొత్త
వైరస్ కర్నూలు కేంద్రంగా పుట్టిందంటూ ఓ టీవీ చానల్ డిబేట్లో అన్నారని, ఈ
వైరస్ కరోనా కంటే 10 నుంచి 15 రెట్లు తీవ్రంగా వ్యాప్తి చెందుతుందంటూ
చెప్పారని అన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా మాట్లాడిన మంత్రి
అప్పలరాజుపై కేసు నమోదు చేయాలని టీడీపీ నాయకులు ఎస్ఐ వెంకటరెడ్డిని
కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్ భాస్కర్రెడ్డి, నాయకులు రమేష్రెడ్డి,
తెలుగుయువత నాయకులు మద్దిలేటి వేణు, కృష్ణారెడ్డి, రవూఫ్, కళాకర్, గిరి
పాల్గొన్నారు.
కర్నూలులో: మంత్రి అప్పలరాజుపై టీడీపీ నాయకుడు పేరపోగు
రాజు సోమవారం కర్నూలు తాలుకా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంత్రి
ఇటీవల ఒక చానల్లో ప్రజలు భయాందోళనలకు గురయ్యేలా మాట్లాడారని, వెంటనే
మంత్రిపై కేసు నమోదు చేయాలని కోరారు.