చిత్తూరు పీఎస్లో మంత్రి కొడాలి నానిపై ఫిర్యాదు
ABN , First Publish Date - 2020-09-28T22:11:50+05:30 IST
మంత్రి కొడాలి నానిపై చిత్తూరు వన్టౌన్ పీఎస్లో టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు పార్లమెంటు అధ్యక్షులు పులివర్తి నాని ఫిర్యాదు చేశారు. మంత్రి స్థాయిలో
చిత్తూరు: మంత్రి కొడాలి నానిపై చిత్తూరు వన్టౌన్ పీఎస్లో టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు పార్లమెంటు అధ్యక్షులు పులివర్తి నాని ఫిర్యాదు చేశారు. మంత్రి స్థాయిలో ఉండి రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న నానిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మంత్రి పదవి నుంచి కొడాలి నాని భర్తరఫ్ చేయాలని నేతలు డిమాండ్ చేశారు. ఇక నిన్నటి రోజున అగరం మంగళం ఆలయంలో జరిగిన నంది విగ్రహం ధ్వంసం సంఘటనలో టీడీపీని ఇరికించాలని పోలీసులు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని నేతలు హెచ్చరించారు.