Aryan Khan కేసులో మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యలపై ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-10-12T01:16:41+05:30 IST

ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో షారూక్‌ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్టుపై వ్యాఖ్యలు చేసిన పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా...

Aryan Khan కేసులో మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యలపై ఫిర్యాదు

న్యూఢిల్లీ: ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో షారూక్‌ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ అరెస్టుపై వ్యాఖ్యలు చేసిన పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీపై ఫిర్యాదు నమోదైంది. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఢిల్లీకి చెందిన లాయర్ ఒకరు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భిన్న మతాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగెట్టేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.


ఆర్యన్ ఖాన్‌ను అతని ఇంటిపేరు (ఖాన్) కారణంగానే కేంద్ర సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్నాయని అంతకుముందు మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. నలుగురు రైతులను చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక కేంద్ర మంత్రి కుమారుడిని అరెస్టు చేయడానికి బదులుగా కేంద్ర సంస్థలు 23 సంవత్సరాల వయసున్న ఆర్యన్ ఖాన్ ను అరెస్టు చేశారని పేర్కొన్నారు.  బిజెపి తన హిందూ ఓటు బ్యాంక్ వికృతమైన కోరిక తీర్చడం కోసం ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. ఇది న్యాయానికి జరుగుతున్న అవమానమని మెహబూబా ముఫ్తీ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2021-10-12T01:16:41+05:30 IST