డీజీపీకి శిరోముండనం బాధితుడి ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-08-04T11:35:05+05:30 IST

రాష్ట్ర డీజీపీ గౌతంసవాంగ్‌కు శిరోముండనం బాధితుడు ఇండుగమిల్లి ప్రసాద్‌ ఫిర్యాదు చేశాడు...

డీజీపీకి శిరోముండనం బాధితుడి ఫిర్యాదు

రాజమహేంద్రవరం, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర డీజీపీ గౌతంసవాంగ్‌కు శిరోముండనం బాధితుడు ఇండుగమిల్లి ప్రసాద్‌ ఫిర్యాదు చేశాడు. గతనెల 21న జరిగిన సంఘటనలు, తర్వాత పరిణామాలను అందులో వివరించాడు. శిరోముండనం చేయడానికి తెరవెనుక వ్యూహం పన్నిన వారిని వదిలేసి ఎస్‌ఐను మాత్రమే అరెస్ట్‌ చేశారన్నారు. ఎస్‌ఐ ఫోన్‌ కాల్‌ రిజిస్టర్‌ బయటపెడితే అసలు నిందితులు బయటకు వస్తారని వివరించాడు. తనకు జరిగిన శిరోముండనం సంఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని కోరాడు. తనకు న్యాయం చేయాలని, సమాజంలో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశాడు.

Updated Date - 2020-08-04T11:35:05+05:30 IST