నా పేరుతో ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసాలు
ABN , First Publish Date - 2020-10-22T09:43:59+05:30 IST
తన పేరు వాడుకుని ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేస్తున్న గ్యాంగ్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన సలహాదారు
డీజీపీకి అజేయ కల్లం ఫిర్యాదు
అమరావతి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): తన పేరు వాడుకుని ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేస్తున్న గ్యాంగ్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ కల్లం.. డీజీపీ సవాంగ్కు ఫి ర్యాదు చేశారు. మంగళగిరికి చెందిన ముఠా ప్రభుత్వంలో జూనియర్ లైన్మన్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చే స్తున్నట్టు వాట్సా్పలో వైరల్ అవుతోందని, ఆ గ్యాంగ్ తన పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతుందనేది సందేశాల సారాంశమని ఫిర్యాదులో పేర్కొన్నారు.