ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబుపై రాష్ట్రపతి, గవర్నర్‌కు ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-08-13T17:15:47+05:30 IST

అమరావతి: ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబుపై మెయిల్ ద్వారా రాష్ట్రపతి, గవర్నర్‌కు.. కోర్టును, లాయర్లను ఉద్దేశించి రవీంద్రబాబు చేసిన

ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబుపై రాష్ట్రపతి, గవర్నర్‌కు ఫిర్యాదు

అమరావతి: ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబుపై మెయిల్ ద్వారా రాష్ట్రపతి, గవర్నర్‌కు.. కోర్టును, లాయర్లను ఉద్దేశించి రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై న్యాయవాది లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. నేరుగా ఫిర్యాదు చేసేందుకు గవర్నర్ అనుమతిని లక్ష్మీనారాయణ కోరారు. రవీంద్రబాబును ఎమ్మెల్సీగా అనర్హుడిగా ప్రకటించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల కుట్రపూరితంగా కోర్టులను విమర్శిస్తున్నారని.. కోర్టుల ప్రతిష్ట దెబ్బతీసే లక్ష్యంతో కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్నది ఎవరో తేల్చాలన్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే హైకోర్టు సీజేకు లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు.

Updated Date - 2020-08-13T17:15:47+05:30 IST