సీఎం ఆఫీస్ నంబర్లకు ఫిర్యాదుల వెల్లువ
ABN , First Publish Date - 2021-07-30T23:46:15+05:30 IST
సచివాలయంలో సామాన్య ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన సీఎం ఆఫీస్ నంబర్లకు ఫిర్యాదులు
హైదరాబాద్: సచివాలయంలో సామాన్య ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన సీఎం ఆఫీస్ నంబర్లకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రగతి భవన్ అపాయింట్మెంట్ కోసం సెక్రెటేరియేట్లోని పేషీని పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సంప్రదిస్తున్నారు. అత్యవసరం కోసం ఎవరైనా సచివాలయంలో ఉన్న నెంబర్ను సంప్రదిస్తే ఎవరికి అయినా కాంటాక్ట్ నంబర్ ఇచ్చేవారు. గతంలో ఉన్న నంబర్లనే సామాన్య ప్రజలు సంప్రదిస్తున్నారు. ఉన్న పాత నంబర్లనే వెబ్సైట్లో అధికారులు ఉంచారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై సంబంధిత కార్యాలయలకు బీఆర్కే భవన్ సీఎం పేషీ అధికారులు సమాచారం అందిస్తున్నారు. అయితే ఇతర శాఖల సిబ్బంది స్పందించడం లేదు. దీంతో సమస్యలు సీఎం దృష్టికి తీసుకొచ్చే క్రమంలో బీఆర్కే భవన్లో ఉన్న సీఎం పేషీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
సీఎంను కలిసేందుకు ప్రగతి భవన్ నంబర్ ( 04023403999 ప్రగతి భవన్ నంబర్ )ను బీఆర్కే భవన్ సీఎం పేషీ సిబ్బంది ఇస్తున్నారు. అయితే బీఆర్కేభవన్లో ఉన్న నంబర్( 04023456698 )ను తిరిగి కాంటాక్ట్ చేయాలని సీఎం క్యాంప్ కార్యాలయ సిబ్బంది చెప్తున్నారు. దీంతో తమ సమస్యలు ఎలా షరిష్కారం అవుతాయో తెలియక సామాన్య ప్రజలు తలలు పట్టుకుంటున్నారు.