ఎమ్మెల్యే విడదల రజనీపై ఎస్సీ కమిషన్కు ఫిర్యాదులు
ABN , First Publish Date - 2021-08-24T20:59:26+05:30 IST
చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీపై ఎస్సీ కమిషన్కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
గుంటూరు: చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీపై ఎస్సీ కమిషన్కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం ఎడవల్లి సొసైటీ రైతులు ఎస్సీ కమిషన్ బృందాన్ని కలిసి సమస్యలను విన్నవించారు. గ్రానైట్ కోసం తమ భూములను ప్రభుత్వం తీసుకుంటోందని రైతులు ఫిర్యాదు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే రజనీ న్యాయం చేస్తామని చెప్పారని, అధికారంలోకి వచ్చాక మాట తప్పారన్నారు. తమ భూములు తమకే ఉండేలా చూడాలని ఎస్సీ కమిషన్ను రైతులు కోరారు. మైనింగ్ కోసం భూములు ఇవ్వలేదనే కారణంతో మురికిపూడి ఆదిబాబుపై అధికార పార్టీ దాడి చేసిందని ఎస్సీ కమిషన్కు రైతులు తెలిపారు. ఎమ్మెల్యే రజనీ అండతోనే అధికార పార్టీ నేతలు తమపై దాడి చేశారని కమిషన్కు ఫిర్యాదు చేశారు. అలాగే చిలకలూరిపేటలో దళితుల శ్మశానం కబ్జా చేశారని ఓ రైతు ఫిర్యాదు చేశారు. చిలకలూరిపేటలో దళితులకు ఇచ్చిన స్థలాలును కబ్జా చేశారని మరో రైతు ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశారు.