క్వారంటైన్ పూర్తి.. వారందరూ స్వస్థలాలకు తరలింపు
ABN , First Publish Date - 2020-04-10T12:07:20+05:30 IST
క్వారంటైన్ పూర్తి.. వారందరూ స్వస్థలాలకు తరలింపు
కృష్ణా/నూజివీడు: నూజివీడు ట్రిపుల్ ఐటీలో 14 రోజులుగా క్వారంటైన్ పూర్తిచేసుకున్న వారిని అధికారులు బుధవారం వారి స్వస్థలాలకు పంపించారు. తెలంగాణ నుంచి గత నెలలో నూజివీడు మీదుగా వారి స్వస్థలాలకు వెళుతున్న 49 మందిని అధికారులు నూజివీడులో గుర్తించి ట్రిపుల్ ఐటీ క్వారంటైన్ యూనిట్కు తరలించారు. 14 రోజుల అనంతరం కరోనా లక్షణాలు ఏమీ లేకపోవడంతో వ్యక్తిగత అంగీకారంతో మరో 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండటానికి అనుమతినిచ్చి స్వస్థలాలకు పంపించినట్లు తహసీల్దార్ ఎం.సురేష్కుమార్ తెలిపారు. బాలయోగి గురుకుల పాఠశాలలో క్వారంటైన్లో ఉన్న వారికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించి వారి స్వస్థలాలకు పంపి’స్తామని తహసీల్దార్ తెలిపారు. నూజివీడులో 9 నుంచి 13 వార్డుల వరకు రెడ్ జోన్ అమలులో ఉండటంతో పోలీసులు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.