సచివాలయ భవనాలు త్వరగా పూర్తి చేయండి

ABN , First Publish Date - 2021-06-19T05:07:54+05:30 IST

మండల పరిధిలోని కొత్తప ల్లె గ్రామ పంచాయతీ కార్యాల య ఆవరణలో నిర్మిస్తున్న కొత్త పల్లె సచివాలయం -1 భవన నిర్మాణాలను త్వరగా పూర్తి చే యాలని జిల్లా జాయింట్‌కలెక్టర్‌ సాయికాంత్‌వర్మ అధి కారులను ఆదేశించారు.

సచివాలయ భవనాలు త్వరగా పూర్తి చేయండి
సచివాలయ భవనాలను పరిశీలిస్తున్న జేసీ సాయికాంత్‌వర్మ

ప్రొద్దుటూరు రూరల్‌, జూన్‌ 18: మండల పరిధిలోని కొత్తప ల్లె గ్రామ పంచాయతీ కార్యాల య ఆవరణలో నిర్మిస్తున్న కొత్త పల్లె సచివాలయం -1 భవన నిర్మాణాలను త్వరగా పూర్తి చే యాలని జిల్లా జాయింట్‌కలెక్టర్‌ సాయికాంత్‌వర్మ అధి కారులను ఆదేశించారు. ఒకే ఆవరణలో సచి వాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్‌ క్లినిక్‌లు ఉండేలా సిద్ధం చే యాలన్నారు. శుక్రవారం ఆయన సచివాలయ భవన నిర్మాణాలను పరిశీలించి  జులై 7వ తేదీలోపల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పనులను నాణ్యత తోపాటు వేగవంతం చేయాలన్నారు. జేసీ వెంట  పంచాయతీరాజ్‌ శాఖ ఎస్‌ఈ జీవీ సుబ్బారెడ్డి, ఈఈ పాపిరెడ్డి, డీఈ మల్లీశ్వరరెడ్డి, ఏఈ సుబ్బారెడ్డి, సర్పంచ్‌ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, ఏపీవో కల్యాణి, టెక్నికల్‌ అసిస్టెం ట్‌ హరి, కార్యదర్శి పుల్లారెడ్డి తదితరులు ఉన్నారు. 

Updated Date - 2021-06-19T05:07:54+05:30 IST