క్వారీపై సమగ్ర జాయింట్‌ సర్వే

ABN , First Publish Date - 2020-06-03T10:35:02+05:30 IST

జలుమూరు కొండ భాగంలో నిర్వహిస్తున్న క్వారీకి సంబంధించి ఎంతమేర లీజుకు తీసుకున్నారు, ఎంత వాడుతున్నారన్న ..

క్వారీపై సమగ్ర జాయింట్‌ సర్వే

జలుమూరు, జూన్‌ 2: జలుమూరు కొండ భాగంలో నిర్వహిస్తున్న క్వారీకి సంబంధించి ఎంతమేర లీజుకు తీసుకున్నారు, ఎంత వాడుతున్నారన్న విషయమై రెవెన్యూ, గనుల శాఖలతో సమగ్ర జాయింట్‌ సర్వే చేసి జిల్లా అధికారులకు నివేదిక అందిస్తామని  గనులు, భూగర్భజల శాఖ అసిస్టెంట్‌ జియాలజిస్ట్‌ కె.పురుషోత్తం నాయుడు తెలిపారు. క్వారీ నిర్వహణలో బ్లాస్టింటింగ్‌ వల్ల సమీపంలోని వ్యవసాయ పొలా ల్లో రాళ్లు పడి పంట నష్టం జరుగుతోందని లింగాలవలసకు చెందిన రైతులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మంగళవారం క్వారీని ఆయన పరిశీలించారు. హద్దులు, బ్లాస్టింగ్‌ అనుమతులు, లీజు కాల పరిమితి, పర్యావరణ అనుమతి తదితర అంశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ పరిశీలనలో గనులశాఖ ఆర్‌ఐ వీబీ రమణ, క్వారీ యజమాని వరుదు చిన్నికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-03T10:35:02+05:30 IST