రాజీమార్గమే రాజమార్గం
ABN , First Publish Date - 2021-10-21T04:27:01+05:30 IST
రాజీమార్గమే రాజమార్గమని జిల్లా ఆరవ అదనపు న్యాయమూర్తి నీలిమ అన్నారు.
జిల్లా ఆరవ అదనపు న్యాయమూర్తి నీలిమ
దుబ్బాక, అక్టోబరు 20 : రాజీమార్గమే రాజమార్గమని జిల్లా ఆరవ అదనపు న్యాయమూర్తి నీలిమ అన్నారు. బుధవారం మండలంలోని పెద్దగుండవెళ్లి గ్రామంలో మండల న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతిఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సర్పంచ్ రాజిరెడ్డి, ఎంపీటీసీ రవి, సిద్దిపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవునూరి రవీందర్, దుబ్బాక సీఐ శ్రీనివా్సరెడ్డి, ఎస్ఐ స్వామి, న్యాయవాదులు ప్రకాష్, సంజీవరెడ్డి, మనోహర్, కృష్ణమోహన్, కిషోర్, భాస్కర్, నవీన్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.