ధాన్యం రైతుల ఆందోళన

ABN , First Publish Date - 2020-02-07T09:20:49+05:30 IST

వాతా వరణ మార్పులతో ధాన్యం రైతులు ఆం దోళన చెందుతున్నారు. అకాల వర్షాలతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి

ధాన్యం రైతుల ఆందోళన

వాతా వరణ మార్పులతో ధాన్యం రైతులు ఆం దోళన చెందుతున్నారు. అకాల వర్షాలతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి నెల కొంది. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలు ఏ ర్పాటుచేసినా మిల్లర్లు సహకరించ డం లేదు. దీంతో పొలాల్లోనే టార్పాలిన్లు కప్పి ధాన్యాన్ని నిల్వ ఉంచవలసి వస్తోం ది. మండలంలోని పణుకువలస, పాం చాళిలో ప్రత్యేక కొనుగోలు కేంద్రాల తోపాటు కేశలి, మోసూరు పీఏసీఎస్‌ల వద్ద కూడా ధాన్యం కొనుగోలు చేశారు. ఈ కేంద్రాల ద్వారా 40కేజీల చొప్పున 22,900 ధాన్యం బస్తాలు కొనుగోలు చేశారు. వీటిలో ఇంకా మిల్లర్లు 14,300 ధాన్యం బస్తాలు తీసుకువెళ్లాల్సి ఉంది. అయితే, 1156, 1121, 1075 ధాన్యం రకాలు ఉండటంతో మిల్లర్లు నిరాకరిస్తున్నట్టు తెలుస్తోంది. నిల్వ ఉన్న ధాన్యం బస్తాలకు సంబంధించి బిల్లుల విషయమై ఉన్నతాధికారులకు నివేదిక పంపించామని ఏవో బి.గోవిందరావు తెలిపారు.

Updated Date - 2020-02-07T09:20:49+05:30 IST