బీమా ఉద్యోగుల ఆందోళన

ABN , First Publish Date - 2021-02-25T04:57:05+05:30 IST

ఎల్‌ఐసీలో ఐపీవోను రద్దు చేయాలని బుధవారం స్థానిక గరివిడి బీమా శాఖ వద్ద ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. భోజన విరామ సమయంలో వారు ఆందోళన వ్యక్తం చేశారు.

బీమా ఉద్యోగుల ఆందోళన
నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు

 గరివిడి:  ఎల్‌ఐసీలో ఐపీవోను రద్దు చేయాలని బుధవారం స్థానిక గరివిడి బీమా శాఖ వద్ద  ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. భోజన విరామ సమయంలో వారు ఆందోళన వ్యక్తం చేశారు.  ఎఫ్‌డీఐ పరిమితిని 49 నుంచి 74 శాతం వరకు పెం పుదల వంటి ప్రతిపాదనలను కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టడం శోచనీయమన్నారు. ఈ ప్రతిపాదనను తక్షణమే విరమించుకోవాలన్నారు.  క్లాస్‌ 3 ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కంది సత్యనారాయణమూర్తి, కార్యదర్శి  రాకేష్‌ వర్మ, క్లాస్‌ 1 ఉద్యోగుల సంఘం నాయకులు కె.గోవింద్‌ క్లాస్‌ 2 ఉద్యోగుల సంఘం నాయకులు ఎంపీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-02-25T04:57:05+05:30 IST