ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం చేస్తే ఆందోళనలే

ABN , First Publish Date - 2021-04-18T06:02:52+05:30 IST

ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం చేస్తే ఆందోళనలు చే స్తామని రైతులు హెచ్చరించారు. డిచ్‌పల్లి మండలంలోని బర్దీపూర్‌ సహకార సంఘ పరిధిలో వరిధాన్యం సేకరణలో జరుగుతున్న జాప్యంపై శనివారం విండో పరిధిలోని బర్దీపూర్‌, ఆరేపల్లి, ధర్మారం(బి) గ్రామాల రైతు లు వ్యవసాయాధికారులతో సమావేశం నిర్వహించారు.

ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం చేస్తే ఆందోళనలే

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 17: ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం చేస్తే ఆందోళనలు చే స్తామని రైతులు హెచ్చరించారు. డిచ్‌పల్లి మండలంలోని బర్దీపూర్‌ సహకార సంఘ పరిధిలో వరిధాన్యం సేకరణలో జరుగుతున్న జాప్యంపై శనివారం విండో పరిధిలోని బర్దీపూర్‌, ఆరేపల్లి, ధర్మారం(బి) గ్రామాల రైతు లు వ్యవసాయాధికారులతో సమావేశం నిర్వహించారు. రెండు వారాలుగా వ్యవసాయశాఖ అధికారులు నాణ్యమైన ధాన్యం ధృవపత్రం ఇవ్వని కా రణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. కరోనా పరిస్థితిలో కూలీలు దొరకడంలేదని, రెండు కిలోల ధాన్యం క్వింటాలుకు అదనంగా ఇ చ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం చేస్తే మూడు గ్రామాల రైతులు రాస్తారోకోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని వ్య వసాయ అధికారులకు తేల్చి చెప్పారు. కష్టపడి పండించిన ధాన్యానికి చన్ని పేరుతో ఇబ్బందులకు గురిచేయడం సబబుకాదని, రైతులను వ్యవసాయ అధికారులే ఆదుకోవాలని కోరారు. తాము ధాన్యాన్ని చన్ని పడితేనే కొనుగోలు చేస్తామని వ్యవసాయ అధికారి వెంకటలక్ష్మి రైతులకు, విండో సి బ్బందికి వివరించారు. ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించాలని అన్నా రు. ఈ సమావేశంలో ఏవో రాంబాబు, రామకృష్ణ, సహకార సంఘ డైరెక్టర్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-18T06:02:52+05:30 IST