జగన్‌ కండిషన్స్‌ అప్లయ్‌ సీఎంగా మారిపోయారు: పట్టాభి

ABN , First Publish Date - 2020-05-29T02:05:28+05:30 IST

సీఎం జగన్‌ కండిషన్స్‌ అప్లయ్‌ సీఎంగా మారిపోయారని టీడీపీ నేత పట్టాభి ఎద్దేవాచేశారు. 25 మంది ఎంపీలను ఇస్తే హోదా తెస్తామన్న జగన్‌ హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. హోదాపై జగన్ ఇచ్చిన మాట తప్పి..

జగన్‌ కండిషన్స్‌ అప్లయ్‌ సీఎంగా మారిపోయారు: పట్టాభి

అమరావతి: సీఎం జగన్‌ కండిషన్స్‌ అప్లయ్‌ సీఎంగా మారిపోయారని టీడీపీ నేత పట్టాభి ఎద్దేవాచేశారు. 25 మంది ఎంపీలను ఇస్తే హోదా తెస్తామన్న జగన్‌ హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. హోదాపై జగన్ ఇచ్చిన మాట తప్పి... ప్రజలను నట్టేట ముంచారని దుయ్యబట్టారు. రాష్ట్రావసరం కోసమే ఎన్డీయేలో నుంచి టీడీపీ బయటకొచ్చిందని తెలిపారు. కేసుల భయం ఉండుంటే ఎన్డీయేలోనే ఉండేవాళ్లమన్నారు. జగన్‌లా ప్రజలను టీడీపీ ఎప్పుడూ మోసం చేయలేదని పేర్కొన్నారు. 22మంది ఎంపీలున్న వైసీపీ ఏనాడైనా పార్లమెంట్‌లో పోరాడారా? అని ప్రశ్నించారు. టీడీపీకి ఉన్నది ముగ్గురు ఎంపీలైనా పార్లమెంట్‌లో గట్టిగా పోరాడుతున్నామని చెప్పారు. ఎంపీ సుజనాచౌదరి పార్టీ మారడం ఆయన వ్యక్తిగత అంశమని తొచిపుచ్చారు. ప్రత్యేకహోదా అంశంపై టీడీపీ ఒక్క అడుగు కూడా వెనుకడుగేయలేదని పట్టాభి స్పష్టం చేశారు.

Updated Date - 2020-05-29T02:05:28+05:30 IST