నిబంధనలకు లోబడి కొంటాం!
ABN , First Publish Date - 2021-11-28T06:27:07+05:30 IST
నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని, నిబంధనలకు లోబడి తడిచిన, మొలకెత్తిన, రంగుమారిన ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు స్పష్టంచేశారు.
వర్షాలకు దెబ్బతిన్న చేలను పరిశీలించిన కన్నబాబు
మండపేట, నవంబరు 27 : నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని, నిబంధనలకు లోబడి తడిచిన, మొలకెత్తిన, రంగుమారిన ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు స్పష్టంచేశారు. శాసనసభ సమావేశాలు ముగిసిన నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పంట నష్టం పరిస్థితులను పరిశీలించాలని మంత్రులు, ఎమ్మె ల్యేలను ఆదేశించడంతో తాను ఉభయగోదావరి జిల్లాల్లో శనివారం పంట పొలాలను పరిశీలించానని చెప్పారు. మండపేట బైసాస్ రోడ్డులో మంత్రి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన తర్వాత మాట్లాడుతూ భారీ వర్షాలకు వరి బాగా దెబ్బతిందన్నారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ రైతులను ఆదుకోవాలని మంత్రిని కోరారు. మున్సిపల్ చైర్మన్ పతివాడ నూకదుర్గారాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ టి.వనజారెడ్డి, ఆలమూరు తాలుకా రైస్మిల్లర్సు అధ్యక్షుడు వేగుళ్ల పట్టాభిరామయ్యచౌదరి, కర్రి పాపారాయుడు, రెడ్డి రాధాకృష్ణ, వ్యవసాయశాఖ జేడీ విజయకుమార్, ఏడీ సీహెచ్కేవి చౌదరి, మండల వ్యవసాయాధికారి, తహసీల్దార్, ఎంపీడీవో పాల్గొన్నారు.