ఏపీలోకి అనుమతించడానికి షరతులు: జగదేశ్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-03-26T22:14:55+05:30 IST

తెలంగాణ- ఆంధ్రా సరిహద్దు చెక్‌పోస్ట్‌ల వద్ద ఇబ్బందులపై ఇరురాష్ట్రాల సీఎంలు చర్చించారని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. దామరచర్ల మండలం వాడపల్లిలో బార్డర్ చెక్‌పోస్ట్‌ను జగదీశ్‌రెడ్డి సందర్శించారు.

ఏపీలోకి అనుమతించడానికి షరతులు: జగదేశ్‌రెడ్డి

నల్లగొండ: తెలంగాణ- ఆంధ్రా సరిహద్దు చెక్‌పోస్ట్‌ల వద్ద ఇబ్బందులపై ఇరురాష్ట్రాల సీఎంలు చర్చించారని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. దామరచర్ల మండలం వాడపల్లిలో బార్డర్ చెక్‌పోస్ట్‌ను జగదీశ్‌రెడ్డి సందర్శించారు. ప్రయాణికులను ఏపీలోకి అనుమతించడానికి షరతులు ఉన్నట్లు ప్రకటించారు. ప్రతి ప్రయాణికుడికి స్క్రీనింగ్‌ పరీక్ష చేసిన తర్వాతే ఏపీలోకి అనుమతిస్తారని, ఈ రోజు రాత్రి వరకే సడలింపు ఉంటుందని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2020-03-26T22:14:55+05:30 IST