చాలీచాలని జీతాలతో అవస్థలు

ABN , First Publish Date - 2021-10-15T05:15:21+05:30 IST

చాలీచా లని జీతాలతో అవస్థలు పడుతున్నామని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పని చేస్తున్న గెస్ట్‌ఫ్యాకల్టీలు తెలి పారు.

చాలీచాలని జీతాలతో అవస్థలు
అచ్చెన్నకు వినతిపత్రం అందిస్తున్న దృశ్యం

  ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు గెస్ట్‌ఫ్యాకల్టీల వినతి

కోటబొమ్మాళి:  చాలీచా లని జీతాలతో అవస్థలు పడుతున్నామని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పని చేస్తున్న గెస్ట్‌ఫ్యాకల్టీలు తెలి పారు. ఈ మేరకు గురువా రం  టెక్కలి ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడును నిమ్మాడ లోని ఆయన క్యాంపు కార్యా లయంలో కలిసి సమస్యలను వివరించారు. కాంట్రాక్ట్‌ లెక్చలర్లతో సమానంగా తాము కూడా పనిచేస్తున్నప్పటికీ రూ.10వేలు  వేతనం ఇస్తున్నారని  వివరిం చారు. సమాన పనికి సమానం వేతనం ఇవ్వాలనే నిబంధన ఉన్నప్పటికీ అమలు చేయడంలేదని చెప్పారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందించారు. అచ్చెన్నాయడును కలిసిన వారిలో సీహెచ్‌ జోగారావు, సీహెచ్‌.వసంతరావు, సీహెచ్‌ రవికుమార్‌ ఉన్నారు.      

   

Updated Date - 2021-10-15T05:15:21+05:30 IST