ఫిబ్రవరి 12న జడ్పీటీసీల సదస్సు
ABN , First Publish Date - 2021-01-26T08:59:53+05:30 IST
రాష్ట్రంలోని జడ్పీటీసీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న సదస్సు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర జడ్పీటీసీల సంఘం తెలిపింది
హైదరాబాద్, జనవరి 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని జడ్పీటీసీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 12న సదస్సు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర జడ్పీటీసీల సంఘం తెలిపింది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించింది. హైదరాబాద్లోని పంచాయతీరాజ్ కార్యాలయంలో జడ్పీటీసీల సంఘం అధ్యక్షుడు బెల్లం శ్రీనివాసరావు సోమవారం విలేకరులతో మాట్లాడారు. ప్రతి జడ్పీటీసీకి ఏటా రూ.50లక్షలు కేటాయించాలని డిమాండ్ చేశారు. గౌరవ వేతనాన్ని రూ.25 వేలకు పెంచాలని కోరారు.