30న టీయూలో సైబర్ నేరాలపై సదస్సు
ABN , First Publish Date - 2022-01-29T05:52:18+05:30 IST
టీయూలో మహిళ విభాగం ఆధ్వర్యంలో షీ టీం నిజామాబాద్ సౌజన్యంతో ఈ నెల 30న సాయంత్రం 4గంటలకు సైబర్ నేరాలు, మహిళా సంరక్షణపై అవగహణ సదస్సు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ డాక్టర్ అపర్ణ తెలిపారు.
డిచ్పల్లి, జనవరి 28: టీయూలో మహిళ విభాగం ఆధ్వర్యంలో షీ టీం నిజామాబాద్ సౌజన్యంతో ఈ నెల 30న సాయంత్రం 4గంటలకు సైబర్ నేరాలు, మహిళా సంరక్షణపై అవగహణ సదస్సు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ డాక్టర్ అపర్ణ తెలిపారు. షీం టీం మహిళ కానిస్టేబుల్ రేఖ రాణి, హరిత రాణి, వర్చువల్ వేదికగా ఆన్లైన్లో హాజరై విద్యార్థులకు అవగహన కల్పిస్తారన్నారు. సైబర్ నేరాలపై జాగ్రత్త వహించాలన్నారు.