విజయవాడ: రెండు విద్యార్థి గ్రూపుల మధ్య ఘర్షణ

ABN , First Publish Date - 2020-05-31T16:33:57+05:30 IST

నగరంలోని పటమటలో విద్యార్థులు రౌడీల్లా ప్రవర్తించారు.

విజయవాడ: రెండు విద్యార్థి గ్రూపుల మధ్య ఘర్షణ

విజయవాడ: నగరంలోని పటమటలో విద్యార్థులు రౌడీల్లా ప్రవర్తించారు. రెండు విద్యార్థుల గ్రూపులు పరస్పరం ఘర్షణ పడ్డాయి. కత్తులు, కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. అచ్చం సినిమాలోలా జరిగిన ఈ గొడవలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ఈ దాడిలో పలువురు రౌడీషీటర్లు కూడా పాల్గొన్నట్లు సమాచారం. ఇందులో కొందరికి రాజకీయ నేతలతో సంబంధాలు ఉండడంతో  పోలీసులు విచారణ కూడా రహస్యంగా జరుపుతున్నట్లు తెలియవచ్చింది.

Updated Date - 2020-05-31T16:33:57+05:30 IST