స్థలం వివాదంలో గొడవ.. వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-05-17T05:04:43+05:30 IST
స్థలం వివాదంలో ఒకరికొకరు దాడులు చేసుకోగా ఒకరు మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని సిద్దాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై రంజిత్ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దాపూర్ గ్రామానికి చెందిన చిరంజీవి, పిట్లం ప్రవీణ్కు గత కొంతకాలంగా స్థలం విషయంలో గోడవలు జరుగుతున్నాయి.
పిట్లం, మే 16: స్థలం వివాదంలో ఒకరికొకరు దాడులు చేసుకోగా ఒకరు మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని సిద్దాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై రంజిత్ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దాపూర్ గ్రామానికి చెందిన చిరంజీవి, పిట్లం ప్రవీణ్కు గత కొంతకాలంగా స్థలం విషయంలో గోడవలు జరుగుతున్నాయి. ప్రవీణ్, అన్న అంజయ్య భూమి విషయంలో చిరంజీవితో గొడవపెట్టుకున్నారు. ఇద్దరు అన్నదమ్ములు కలిసి చిరంజివి తలపై కర్రలతో తలపై కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహ నంలో బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిరంజీవి మృతిచెందాడు. మృతిడి తండ్రి కిషన్ ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేశామని ఎస్సై తెలిపారు.