యాదవోలులో వైసీపీ వర్గీయుల ఘర్షణ
ABN , First Publish Date - 2020-05-31T10:48:00+05:30 IST
యాదవోలులో వైసీపీ వర్గీయుల ఘర్షణ
దేవరపల్లి, మే 30: దేవరపల్లి మండలం యాదవోలు గ్రామంలో వైసీపీకి చెందిన ఇరువర్గాల మధ్య శనివారం ఘర్షణ చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు కోలా వీరవెంకట సత్యనారాయణ, ఆరేటి సూర్య నారాయణ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఒకరికి ఒకరు తీవ్ర ఘర్షణ పడటంతో గాయాలు అయ్యాయి. గ్రామంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ స్థల వివాదం వల్లే ఈ ఘర్షణ చోటు చేసుకున్నట్టు తెలిసింది. ఈ ఘర్షణ ఉధృతి కావడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను నిలుపుదల చేశారు. దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందలేదని ఎస్ఐ కె. స్వామి తెలిపారు.