జగన పార్టీలో నాయకులు లేరా?
ABN , First Publish Date - 2021-08-02T05:51:20+05:30 IST
‘జగన పార్టీలో రాజ కీయాల గురించి మాట్లాడే నాయకులే లేరా..? సలహా దారులు రాజకీయాలు మాట్లాడం ఏమిటి’ అని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ ప్రశ్నించారు.
పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్
అనంతపురం రైల్వే, ఆగస్టు 1: ‘జగన పార్టీలో రాజ కీయాల గురించి మాట్లాడే నాయకులే లేరా..? సలహా దారులు రాజకీయాలు మాట్లాడం ఏమిటి’ అని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ ప్రశ్నించారు. ఆదివారం ఆయన పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మా ట్లాడు తూ వైసీపీ పాలనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్ర భుత్వ ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన సమయానికి రావటం లేదన్నారు. చివరికి ఉపాధి బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి ఉందంటే ఇంతకంటే దారుణం ఏముందని ఆవేదన వ్యక్తం చేశారు. పేద విద్యార్థు లకు విదేశీ విద్యకు దూరం చేశారు. ఆక్సిజన లేక, సరైన మందులు లేక ప్రాణాలు పోయాయంటే ఇంతకం టే అసమర్థ పాలన ఎక్కడుంటుందన్నారు. కరోనా సమ యమని ఇంతవరకూ ఎవరూ మాట్లాడలేదని, ఇకపై ఆప రిస్థితి ఉండదన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనా విధానం ఏమిటన్నది అర్థం కావడం లేదన్నారు. జిల్లాలో కాంగ్రెస్ పాలనలో చేపట్టిన పనులను కూడా పూర్తి చేసి ప్రారం భించలేని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. సమావే శంలో జిల్లా అధ్యక్షుడు బండ్లపల్లి ప్రతా్పరెడ్డి, రాష్ట్ర అధి కార ప్రతినిధి నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు వాసు, జిల్లా కార్యదర్శి ఫకృద్దీన, నగరాధ్యక్షుడు వేణుగోపాల్, ఎనఎ్స యూఐ నాయకులు నరేష్ పాల్గొన్నారు.