షర్మిల పార్టీలోకి కాంగ్రెస్ కీలక నేత!
ABN , First Publish Date - 2021-03-11T23:02:43+05:30 IST
తెలంగాణ కాంగ్రెస్ మరో షాక్ తగిలింది. గాయకుడు ఏపూరి సోమన్న కాంగ్రెస్కు రాజీనామా చేశారు. ఈ నెల 15న షర్మిల పార్టీలో
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ మరో షాక్ తగిలింది. గాయకుడు ఏపూరి సోమన్న కాంగ్రెస్కు రాజీనామా చేశారు. ఈ నెల 15న షర్మిల పార్టీలో ఏపూరి సోమన్న చేరనున్నారు. షర్మిల పార్టీలో చేరేందుకే ఆయన కాంగ్రెస్కు రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ని విమర్శించాలన్న ఆలోచన తనకు లేదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ మీద నమ్మకం లేదని చెప్పారు. పార్టీలో సీనియర్లు కూడా వారి భవిష్యత్పై ఆందోళన చెందుతున్నారని, తెలంగాణలో నియంత ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలని ఏపూరి సోమన్న అన్నారు.
ఇప్పటికే షర్మిలను కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్ కలిశారు. షర్మిల పార్టీకి అధికార ప్రతినిధిగా ఇందిరా శోభన్ వ్యవహరించనున్నారు. ఆమె కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ రాజీనామా లేఖలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పులను ఎత్తిచూపారు. తన పట్ల కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరును ఇందిరా ఆక్షేపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీపై ఉన్న అభిమానంతో కాంగ్రెస్ పార్టీలో కొనసాగానని చెప్పారు. తెలంగాణ బిడ్డగా కాంగ్రెస్కు అండగా నిలిచేందుకు పార్టీలో చేరానని తెలిపారు. కాంగ్రెస్లో ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీ కోసం పనిచేశానని రాజీనామా లేఖలో తెలిపారు. కాంగ్రెస్ నుంచి షర్మిల పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీలో పని చేసిన కల్పనా రెడ్డి షర్మిల పెట్టబోయే పార్టీకి మద్దతు తెలిపారు.