రేపు కాంగ్రెస్ మౌన దీక్ష
ABN , First Publish Date - 2021-10-10T21:24:54+05:30 IST
సోమవారం ఇందిరాపార్క్ వద్ద ఉదయం 10 నుంచి కాంగ్రెస్ ఆధ్వర్యంలో మౌన దీక్ష చేపట్టనున్నారు. బీజేపీ నాయకులు యూపీలో చేసిన దారుణమారణ
హైదరాబాద్: సోమవారం ఇందిరాపార్క్ వద్ద ఉదయం 10 నుంచి కాంగ్రెస్ ఆధ్వర్యంలో మౌన దీక్ష చేపట్టనున్నారు. బీజేపీ నాయకులు యూపీలో చేసిన దారుణమారణ కాండపై కాంగ్రెస్ నిరసనకు దిగింది. లఖిమ్పూర్ ఘటనపై కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు గాంధీభవన్లో బీసీ కుల ఘననపై అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఈ కార్యక్రమాలలో టీపీసీసీ అధ్యక్షులు పీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పాల్గొంటారు.