కాంగ్రెస్ పాలనలో ఏ రోజు ఇలా జరగలేదు: జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2021-12-13T23:13:27+05:30 IST

రెండున్నర నెలల నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వరి ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం చేశాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు.

కాంగ్రెస్ పాలనలో ఏ రోజు ఇలా జరగలేదు: జగ్గారెడ్డి

హైదరాబాద్: రెండున్నర నెలల నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వరి ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం చేశాయని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో రైతులు ఎక్కువగా వరిసాగు చేస్తారని చెప్పారు.కొనుగోలు కేంద్రాల్లో గన్ని బ్యాగుల, ట్రాన్స్ పోర్ట్ లేక రైతులు ఇబ్బందిపడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ఏ రోజు ఇలా జరగలేదని గుర్తుచేశారు. రైతు మరణానికి మొదటి తప్పు కేంద్రానిదే, రెండవ తప్పు రాష్ట్ర ప్రభుత్వానిదన్నారు. సొంత నియోజకవర్గంలో రైతు మరణిస్తే మంత్రి హరీష్ రావు కనీసం పరామర్శించలేదన్నారు. ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేకున్నా మానవత్వంతో తనకు తోచిన సహాయం అందిచానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబానికి 25లక్షల సహాయం అందించాలని డిమాండ్ చేశారు. రైతు మరణిస్తే ఆదుకునే పూర్తి బాధ్యత రాష్ట్రానిదేనని స్పష్టం చేశారు. 


Updated Date - 2021-12-13T23:13:27+05:30 IST