క్రాప్ హాలీడే ప్రకటించాలి: మాజీ మంత్రి రాంరెడ్డి

ABN , First Publish Date - 2021-10-27T22:21:44+05:30 IST

రాష్ట్రంలో క్రాప్ హాలీడే ప్రకటించి రైతులకు నష్టపరిహారం అందించాలని

క్రాప్ హాలీడే ప్రకటించాలి: మాజీ మంత్రి రాంరెడ్డి

సూర్యాపేట: రాష్ట్రంలో క్రాప్ హాలీడే ప్రకటించి రైతులకు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి డిమాండ్ చేసారు. యాసంగి వరి సాగుపై ప్రభుత్వం జారీ చేసిన ఆంక్షలను వెనక్కి తీసుకోవాలన్నారు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని  ప్రజా ప్రతినిధులు, అధికారులు ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. వరి తప్ప వేరే పంటలు పండని భూములు ఉన్న రైతుల పరిస్థితి ఏంటని ఆయన నిలదీసారు. ప్రభుత్వ నిర్ణయాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-27T22:21:44+05:30 IST