సింహం సమఉజ్జీలతోనే తలపడుతుంది: కొండా మురళి

ABN , First Publish Date - 2022-01-25T21:49:45+05:30 IST

సింహం సమఉజ్జీలతోనే తలపడుతుందని మాజీ ఎమ్మెల్సీ

సింహం  సమఉజ్జీలతోనే తలపడుతుంది: కొండా మురళి

వరంగల్‌: సింహం సమఉజ్జీలతోనే తలపడుతుందని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అన్నారు.  తన తల్లిదండ్రుల స్మారక స్థూపం నిర్మాణ స్థలంపై చర్చకు చల్లా ధర్మారెడ్డి సిద్ధమా అని ఏబీఎన్‌తో మాట్లాడుతూ మురళి అన్నారు. అగ్రంపహాడ్ జాతర వేదికగా చర్చిద్దాం రా అని చల్లాకు మురళి సవాల్ విసిరారు. సింహం అని అభిమానులు తనను పిల్చుకుంటారని ఏబీఎన్‌తో ఆయన పేర్కొన్నారు. సింహం సమ ఉజ్జీలతోనే తల పడుతుందన్నారు. చల్లా ధర్మారెడ్డి ఓ గుంట నక్క అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రజలను దోచుకుంటున్న చరిత్ర ధర్మారెడ్డిదని ఆయన ఆరోపించారు. ప్రజలకు భూములు పంచిన చరిత్ర తమదని ఏబీఎన్‌తో ఆయన అన్నారు. 

Updated Date - 2022-01-25T21:49:45+05:30 IST