వరి ధాన్యం కొనుగోలులో పెద్ద స్కాం: Madhu yashki
ABN , First Publish Date - 2021-12-28T18:35:12+05:30 IST
వరి ధాన్యం కొనుగోలులో పెద్ద స్కాం జరిగిందని కాంగ్రెస్ నేత మధుయాష్కి ఆరోపించారు.
హైదరాబాద్: వరి ధాన్యం కొనుగోలులో పెద్ద స్కాం జరిగిందని కాంగ్రెస్ నేత మధుయాష్కి ఆరోపించారు. ధాన్యం కొనకుండా మిల్లర్లకే అమ్ముకునే పరిస్థితి తెచ్చారన్నారు. తెలంగాణలో బియ్యం కుంభకోణంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రైతులను వద్దని కేసీఆర్ ఎలా వరి పంట వేశారని ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని మధుయాష్కి డిమాండ్ చేశారు.