hyderabad చేరుకున్న రాజ్యసభ విపక్షనేత మల్లికార్జున్ ఖర్గే
ABN , First Publish Date - 2021-09-03T17:00:07+05:30 IST
రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం ఉదయం నగరానికి చేరుకున్నారు.
హైదరాబాద్: రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం ఉదయం నగరానికి చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఖర్గేకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి హర్కర వేణుగోపాల్, రోహిన్ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు మధ్యాహ్నం 1గంటకు గాంధీభవన్లో మల్లికార్జున్ ఖర్గే, రేవంత్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు.