HYD: మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన మల్లు రవి
ABN , First Publish Date - 2021-10-23T17:52:58+05:30 IST
గాంధీభవన్లో గాడ్సే దూరిండు అని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి తీవ్రంగా ఖండించారు.
హైదరాబాద్: గాంధీభవన్లో గాడ్సే దూరిండు అని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి తీవ్రంగా ఖండించారు. తమ పార్టీ అధ్యక్షులు ఎవరు ఉండాలో తమ అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు. సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే గాడ్సేల్లాగా పాలిస్తూ తెలంగాణను సర్వ నాశనం చేస్తున్నది కేసీఆర్, కేటిఆర్లని విరుచుకుపడ్డారు. బీజేపీతో కేసీఆర్ కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. అందుకే మొన్న రెండు సార్లు ఢిల్లీకి పోయి మోదీ కాళ్ళు మొక్కి వచ్చారన్నారు. నోట్ల రద్దు నుంచి 370 ఆర్టికల్ రద్దు వరకు అనేక అంశాలలో బీజేపీకి మద్దతు ఇచ్చింది టీఆర్ఎస్ అని తెలిపారు. రైతులకు ఉరి తాళ్లుగా మారిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు అసెంబ్లీలో తీర్మాణం చేయమంటే పారిపోయి బీజేపీకి మద్దతు ఇచ్చింది ఎవరని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని చూస్తే కేటీఆర్కు, కేసీఆర్కు వెన్నులో వణుకు పుడుతోందని మల్లు రవి అన్నారు.