టీఆర్‌ఎస్‌ను కొట్టే సత్తా బీజేపీకే ఉంది.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-12-04T17:42:30+05:30 IST

టీఆర్‌ఎస్‌ని ఎదిరించే సత్తా ఉన్న బీజేపీకే ఉందంటూ కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిథిలో...

టీఆర్‌ఎస్‌ను కొట్టే సత్తా బీజేపీకే ఉంది.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: టీఆర్‌ఎస్‌ని ఎదిరించే సత్తా బీజేపీకే ఉందంటూ కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిథిలో నమోదైన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చూస్తే బీజేసీ సత్తా ఏంటో అర్థమవుతుందని ఆయనన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెలువడుతున్న సమయంలో ట్విటర్ వేదికగా ఆయన స్పందించారు. ఉద్యోగులు పూర్తిగా టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్నారన్న విషయం పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో స్పష్టమైందని, అంతేకాకుండా టీఆర్‌ఎస్‌ను ఎదిరించే సత్తా బీజేపీకే ఉందనే విషయం వారు కచ్చితంగా నమ్ముతున్నారని ఆయన చెప్పారు. అయితే ఓ కాంగ్రెస్ నేత మరో పార్టీని ప్రశంసించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అయితే విశ్వేశ్వరరెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరతారన్న వార్తలూ వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.



Updated Date - 2020-12-04T17:42:30+05:30 IST