దోపిడీని తక్షణం ఆపివేయండి: Sailajanath

ABN , First Publish Date - 2021-09-16T18:20:35+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం .. ప్లెక్సీలు పోస్టర్లు వేయించుకోవడం మినహా దేనికి పనికిరాదని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ విమర్శలు గుప్పించారు.

దోపిడీని తక్షణం ఆపివేయండి: Sailajanath

అనంతపురం: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం .. ప్లెక్సీలు పోస్టర్లు వేయించుకోవడం మినహా దేనికి పనికిరాదని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ విమర్శలు గుప్పించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరినీ దోచే ప్రభుత్వమిదని.. ఈ ప్రభుత్వాన్ని నిలదీయడం తరిమికొట్టడం మినహా చేసేదేమీ లేదన్నారు. చెత్త పన్ను, ఆస్తి పన్ను, కరెంటు బిల్లులతో ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు. దోపిడీని తక్షణం ఆపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. రంగులు వేయడం తప్ప తమ రాజ్యం దేనికి పనికి రాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులపై తమ పేర్లు రాసుకోవడం తప్ప ఏం చేశారని ప్రశ్నించారు. రెండున్నర సంవత్సరాల్లో రాష్ట్రం మొత్తం మీద ఒక వెయ్యి ఇళ్లు అయినా కట్టారా అని నిలదీశారు. ‘‘మీ దగ్గర చెప్పుకోవడానికి ఏమీ లేదు.. మీరు దివాళా తీశారు’’ అని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్‌పై కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామన్నారు. బలవంతపు ఏకగ్రీవాలు ముఖ్యంగా కడప జిల్లాలో ఏకగ్రీవాలపై ఎన్నికలు జరపాలని తీర్పు ఇచ్చి వుంటే బాగుండేదని శైలజానాథ్ అభిప్రాయపడ్డారు. 

Updated Date - 2021-09-16T18:20:35+05:30 IST