‘ప్రజల కడుపుమంటలో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం’

ABN , First Publish Date - 2021-09-13T19:43:13+05:30 IST

ప్రజల కడుపుమంట లో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ అన్నారు.

‘ప్రజల కడుపుమంటలో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం’

చిత్తూరు: ప్రజల కడుపుమంటలో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన విద్యుత్ ఛార్జీల నిరసన, ఆందోళనకు శైలజానాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చుకోవడానికి, లగ్జరీలను అనుభవించడం కోసం ప్రజల్ని ఎన్ని రకాలుగా దోపిడీ చేయాలో అన్ని రకాలుగా దోపిడీ చేస్తోందని, అన్ని రంగాల్లోను వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని దోచుకుంటోందని మండిపడ్డారు. దోపిడీని ఆపకపోతే తగిన మూల్యం చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. చివరకు ఒంటిపైన వేసుకునే బట్టలు, జుట్టు కత్తిరించడానికి కూడా పన్ను వేసిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని యెద్దేవా చేశారు.  వ్యవసాయ మోటార్ పంప్ సెట్‌లకు మీటర్లు బిగించడంలోనూ కాంగ్రెస్ పార్టీ ప్రతిఘటించి అడ్డుకుంటామని శైలజానాథ్ స్పష్టం చేశారు. 

Updated Date - 2021-09-13T19:43:13+05:30 IST