దేశంలో సెక్యూలరిజాన్ని రక్షించేది కాంగ్రెస్ పార్టీనే: sailajanath

ABN , First Publish Date - 2021-12-20T19:31:51+05:30 IST

దేశం బీజేపీ కారణంగా నాశనం అవుతోందని ఏపీసీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ విమర్శించారు.

దేశంలో సెక్యూలరిజాన్ని రక్షించేది కాంగ్రెస్ పార్టీనే: sailajanath

శ్రీకాకుళం: దేశం బీజేపీ కారణంగా నాశనం అవుతోందని ఏపీసీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ విమర్శించారు.  దేశంలో  సెక్యూలరిజాన్ని రక్షించేది కాంగ్రేస్ పార్టీనే అని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని, దేశాన్ని నాశనం చేస్తున్న శక్తులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పని చేస్తుందన్నారు. రాష్ట్ర రాజధాని అందరికీ అందుబాటులో ఉండాలని, రెండు రాజధానులు అనేది అవకాశవాదమని తెలిపారు. చంద్రబాబు, జగన్ ఒప్పుకొనే రాష్ట్ర రాజధాని మొదలుపెట్టారని చెప్పారు. శ్రీబాగ్ ఒడంబడిక అమలు కావాలని, రాయలసీమకు నీళ్లు, హైకోర్టు కావాలన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-12-20T19:31:51+05:30 IST