5న రాష్ట్ర బంద్‌కు కాంగ్రెస్ పూర్తి మద్దతు: శైలజానాథ్

ABN , First Publish Date - 2021-03-03T16:03:17+05:30 IST

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఈ నెల 5న ఇచ్చిన రాష్ట్ర బంద్ పిలుపుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ఏపీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ తెలిపారు.

5న రాష్ట్ర బంద్‌కు కాంగ్రెస్ పూర్తి మద్దతు: శైలజానాథ్

అమరావతి: విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఈ నెల 5న ఇచ్చిన రాష్ట్ర బంద్ పిలుపుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ఏపీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ తెలిపారు. వామపక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకం నిర్ణయం మార్చుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బంద్‌లో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. బంద్‌ను జయప్రదం చేయడం ద్వారా విశాఖ ఉక్కుపై ఆంధ్ర ప్రజల హక్కును నిజం చేయాలని శైలజానాథ్ అన్నారు. 

Updated Date - 2021-03-03T16:03:17+05:30 IST