కాంగ్రెస్‌ నేత సంగమేశ్వర్‌ మృతి

ABN , First Publish Date - 2021-11-30T05:15:19+05:30 IST

కాంగ్రెస్‌ నేత సంగమేశ్వర్‌ మృతి

కాంగ్రెస్‌ నేత సంగమేశ్వర్‌ మృతి

ధారూరు: తరిగోపులకు చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు కోలుకుంద సంగమేశ్వర్‌(64) అనారోగ్యంతో సోమవారం సాయంత్రం మృతిచెందారు. కొంత కాలంగా ఆయన ఎముకల సంబంధ వ్యాధితో బాధపడ్డారు. వికారాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తరిగోపులకు తరలించారు. మంగళవారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. సంగమేశ్వర్‌ మృతి పట్ల పలు రాజకీయ పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

  • సదీర్ఘ కాలంగా ప్రజాసేవ ...

తరిగోపుల ప్రజలకు, కాంగ్రెస్‌ పార్టీకి కోలుకుంద సంగమేశ్వర్‌ సుధీర్ఘకాలం సేవలందించారు. 1975 నుంచి 1980వరకు సొసైటీ చైర్మెన్‌గా, 1981-2002 వరకు సర్పంచ్‌గా, 2008-2013 వరకు ఎంపీటీసీగా సేవలందించారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడుగా పదేళ్లు కొనసాగారు. ఆయన కుమారుడు సంతో్‌షకుమార్‌ ప్రస్తుతం జాతీయ యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా, అండమాన్‌, చత్తీ్‌షఘడ్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జిగా జాతీయ రాజకీయాల్లో కొనసాగుతున్నారు.

Updated Date - 2021-11-30T05:15:19+05:30 IST