సీమాంధ్ర.. స్వర్ణాంధ్రగా మారేది: తులసిరెడ్డి

ABN , First Publish Date - 2021-11-16T01:02:33+05:30 IST

తాను ఇచ్చిన హామీలను బీజేపీ నెరవేరిస్తే సీమాంధ్ర..

సీమాంధ్ర.. స్వర్ణాంధ్రగా మారేది: తులసిరెడ్డి

అమరావతి: తాను ఇచ్చిన హామీలను బీజేపీ నెరవేరిస్తే సీమాంధ్ర.. స్వర్ణాంధ్రగా మారేదని కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి అన్నారు. తిరుపతిలో కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్‌షా అధ్యక్షతన జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం ఏపీ ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసిందని పేర్కొన్నారు. ఈ సమావేశంలోనైనా కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలు భావించారని, కానీ ఒక్క సమస్యపై కూడా స్పష్టమైన హామీ, పరిష్కారం లభించలేదన్నారు.


ప్రత్యేక హోదా, రాయలసీమ, ఉత్తరాంధ్రకు స్పెషల్ ప్యాకేజీ ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఇవి అమలై ఉంటే సీమాంధ్ర.. స్వర్ణాంధ్రగా మారేదని ఆయన  అభిప్రాయపడ్డారు. ఏడున్నరేళ్ళలో ఏపీని కేంద్రంలో ఉన్న బీజేపీ మోసం చేసిందన్నారు. పిల్లికి భిక్షం వేసినట్లుగా మొక్కుబడి సాయం చేసి గొప్పలు చెప్పుకోవడం బీజేపీకి పరిపాటిగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. 

Updated Date - 2021-11-16T01:02:33+05:30 IST