టీడీపీలో చేరనున్న కాంగ్రెస్ నేత జీవీ రెడ్డి

ABN , First Publish Date - 2021-10-17T22:54:56+05:30 IST

ఈ నెల 21న కాంగ్రెస్‌ నేత జీవీ రెడ్డి టీడీపీలో చేరనున్నారు. ఆదివారం జీవీ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు.

టీడీపీలో చేరనున్న కాంగ్రెస్ నేత జీవీ రెడ్డి

అమరావతి: ఈ నెల 21న కాంగ్రెస్‌ నేత జీవీ రెడ్డి టీడీపీలో చేరనున్నారు. ఆదివారం జీవీ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. పార్టీలో చేరేందుకు చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో ఆయన టీడీపీలో చేరడం ఖాయమైంది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ఏపీలో క‌నుమ‌రుగైంది. అయినప్పటికీ జీవీ రెడ్డి  తన ప్రసంగాలతో కాంగ్రెస్ వాదనను వినిపిస్తున్నారు. ఆయనకు రాజకీయ, సమాజిక అంశాలపై అవగాహన ఉంది. అందువల్లే అనేక చర్చా వేదికల్లో కాంగ్రెస్ వాణిని ఆయన వినిపిస్తుంటారు. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన జీవీ రెడ్డి  హైద‌రాబాద్‌లో స్థిర‌ప‌డ్డారు. సీఏతో పాటు న్యాయ‌విద్య‌లో కూడా వెంకట్‌రెడ్డి ప‌ట్టా అందుకున్నారు.

Updated Date - 2021-10-17T22:54:56+05:30 IST