తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన కాంగ్రెస్ నేతలు

ABN , First Publish Date - 2020-10-30T01:04:49+05:30 IST

తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారిని కాంగ్రెస్ నేతలు కలిశారు. దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి మండిపడ్డారు.

తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన కాంగ్రెస్ నేతలు

హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారిని కాంగ్రెస్ నేతలు కలిశారు. దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి మండిపడ్డారు. తాము అడిగితే పోస్టల్‌ బ్యాలెట్‌ లిస్ట్‌ ఇవ్వలేదని ఆయన తెలిపారు. పెద్దగుండవెళ్లిలో టీఆర్‌ఎస్‌ సర్పంచ్‌ దగ్గర లిస్ట్‌ ఉందని, లిస్ట్‌లో ఉన్న వారిని టీఆర్‌ఎస్‌ బెదిరించి ప్రలోభపెట్టాలని చూస్తోందని మండిపడ్డారు. ఎన్నికలు సజావుగా నిర్వహించాలని, లేకుంటే నిలిపివేయాలని, దుబ్బాకలో కేంద్ర బలగాలను దింపాలని మర్రి శశిధర్‌రెడ్డి  డిమాండ్ చేశారు. 


అంతకుముందు కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ రాశారు. దుబ్బాకకు కేంద్ర బలగాలను పంపాలని లేఖలో కోరారు. ఉప ఎన్నికలను స్వేచ్ఛగా.. పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్, బీజేపీలు అక్రమ మార్గంలో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్ధి బంధువు ఇంట్లో డబ్బులు దొరికాయని వెంకట్‌రెడ్డి గుర్తుచేశారు.

Updated Date - 2020-10-30T01:04:49+05:30 IST