దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు హుజురాబాద్ ఎన్నికలు: seetakka

ABN , First Publish Date - 2021-10-10T18:42:40+05:30 IST

కాంగ్రెస్ పార్టీని మోసం చేసి వెళ్ళిపోయిన వ్యక్తి కౌశిక్ రెడ్డి అని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క వ్యాఖ్యానించారు.

దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు హుజురాబాద్ ఎన్నికలు: seetakka

హనుమకొండ: కాంగ్రెస్ పార్టీని మోసం చేసి వెళ్ళిపోయిన వ్యక్తి కౌశిక్ రెడ్డి అని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క వ్యాఖ్యానించారు. దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు హుజురాబాద్ ఎన్నికలన్నారు. రాబోయేది కాంగ్రెస్ పార్టీ అధికారమని తెలిపారు. తెలంగాణ ప్రజలు కలలు కన్న పరిపాలన ఈ రెండు పార్టీలు చేయడం లేదని విమర్శించారు. రేపటి నుండి రోడ్లపై కూడా టాక్స్‌లు వేస్తారని సీతక్క అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మిగులు బడ్జెట్‌తో అభివృద్ధి, వసతులు కల్పించిన పార్టీ అని...ఇప్పుడు అప్పుల పాలు, నష్టాల్లో ఉన్న రాష్ట్రం మనదని చెప్పుకొచ్చారు. కాబట్టి ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరారు. బాల్మూరి వెంకట్ కూడా పార్టీలో ఎంతో సేవ చేశారన్నారు.


ఎన్నో న్యాయ పోరాటాలు చేశారని..అందరం కలిసి గెలిపించుకుందామని సీతక్క అన్నారు.  ఇప్పుడు తిట్టుకుంటున్న పార్టీలు నిన్నటివరకు జోడెద్దుల్లా కలిసి పని చేసుకున్న వారే అని చెప్పారు. పార్టీని దెబ్బ తీయడానికి ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. గతంలో జరిగిన అభివృద్ధి కానీ, ఇందిరమ్మ ఇండ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇంతో కొంత చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొచ్చారు. ప్రజలలోకి అందరూ చేరవేసి అందరికి చెప్పి కాంగ్రెస్  పార్టీనీ ముందుకు తీసుకెళ్లాలని, అభ్యర్థి ని గెలిపించుకోవాలని, మన బలాన్ని నిరూపించుకోవాలి అని సీతక్క తెలిపారు.

Updated Date - 2021-10-10T18:42:40+05:30 IST