గుజరాత్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా
ABN , First Publish Date - 2020-06-05T08:22:46+05:30 IST
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో గుజరాత్లో కాం గ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అక్షయ్ పాటేల్, జీతూ చౌద రి బుధవారం రాజీనామా లేఖలు ఇచ్చారని అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది...
అహ్మదాబాద్, జూన్ 4: రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో గుజరాత్లో కాం గ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అక్షయ్ పాటేల్, జీతూ చౌద రి బుధవారం రాజీనామా లేఖలు ఇచ్చారని అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది ప్రకటించారు. వాటి కి ఆమోదం తెలిపానని చెప్పారు. రాజ్యసభ ఎన్నికలు జరగాల్సి ఉండగా చోటు చేసుకున్న ఈ కీలక పరిణామం వెనుక బీజేపీ హస్తం ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.