నేడు సీఎల్పీ సమావేశం
ABN , First Publish Date - 2020-08-09T07:55:31+05:30 IST
పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకాలను ఏపీ ప్రభుత్వం చేపట్టడం, కరోనా కట్టడిలో విఫలమైన ప్రభుత్వం.. అంశాలే అజెండాగా ఆదివారం సీఎల్పీ సమావేశం జరగనుంది...
హైదరాబాద్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకాలను ఏపీ ప్రభుత్వం చేపట్టడం, కరోనా కట్టడిలో విఫలమైన ప్రభుత్వం.. అంశాలే అజెండాగా ఆదివారం సీఎల్పీ సమావేశం జరగనుంది. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరగనుంది. ఇందులో పార్టీ ఎంపీలు ఉత్తమ్కుమార్రెడ్డి, రేవంత్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొంటారు.