ఈటల పట్టించుకోవడం లేదు: జీవన్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-04-03T21:29:32+05:30 IST

ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీతో ప్రజలు సర్వం కోల్పోతున్నారు.. మంత్రి ఈటల రాజేందర్ కూడా ఈ విషయాన్ని..

ఈటల పట్టించుకోవడం లేదు: జీవన్‌రెడ్డి

హైదరాబాద్: ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీతో ప్రజలు సర్వం కోల్పోతున్నారు.. మంత్రి ఈటల  రాజేందర్ కూడా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  కరోనా రోగులకు ఉచిత వైద్య సేవలు అందించాలని చెప్పారు. కరోనా కేసులు ఎక్కువగా  నమోదవుతున్న థియేటర్లు, వైన్స్‌ ఎందుకు మూసివేయట్లేదు? అని జీవన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరోనా సెకండ్ వేవ్ మహారాష్ట్ర నుంచి విస్తరిస్తోంది.. మహారాష్ట్ర నుంచి రాకపోకలను నిలిపివేయట్లేదని జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-04-03T21:29:32+05:30 IST