రైతు వ్యతిరేక చట్టాలపై పార్లమెంట్‌లో పోరాటం: రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-01-19T20:50:50+05:30 IST

రైతు వ్యతిరేక చట్టాలపై పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై

రైతు వ్యతిరేక చట్టాలపై పార్లమెంట్‌లో పోరాటం: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: రైతు వ్యతిరేక చట్టాలపై పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ధ్వజమెత్తారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై పోరాటం చేస్తామని తెలిపారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలు మోదీ వైపు ఉంటారా? రైతుల వైపు ఉంటారా? అనేది తేలుస్తామన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ తోడు దొంగలు అని పేర్కొన్నారు. కేంద్రం చర్చల పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించారు. మోదీతో రాష్ట్ర ప్రభుత్వానికి చీకటి ఒప్పందంలో భాగంగానే అరెస్ట్‌లు జరుగుతున్నాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

Updated Date - 2021-01-19T20:50:50+05:30 IST