పేదలు, బీదల పట్ల ‘వాచ్‌డాగ్’ లా పనిచేయండి : రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2020-04-02T23:44:01+05:30 IST

లాక్‌డౌన్ నేపథ్యంలో పేదలు, బీదల పట్ల కాంగ్రెస్ శ్రేణులు ‘వాచ్‌డాగ్‌’ లా ఉండాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సూచించారు.

పేదలు, బీదల పట్ల ‘వాచ్‌డాగ్’ లా పనిచేయండి : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : లాక్‌డౌన్ నేపథ్యంలో పేదలు, బీదల పట్ల కాంగ్రెస్ శ్రేణులు ‘వాచ్‌డాగ్‌’ లా ఉండాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సూచించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో పేదలు, బీదల పట్ల, నష్టం వాటిల్లుతున్న వారి అవసరాలను కాంగ్రెస్ కార్యకర్తలు గుర్తించాలని ఆయన కోరారు. ‘‘పేదల పట్ల, లాక్‌డౌన్ తో నష్టపోతున్న వారి పట్ల కాంగ్రెస్ వాచ్‌డాగ్‌లా ఉండాలి. ఎంత వీలైతే అంత సాయం చేయండి. వృద్ధులు, పెద్దల విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి’’ అంటూ రాహుల్ ట్విట్టర్ వేదికగా శ్రేణులకు పిలుపునిచ్చారు. 

Updated Date - 2020-04-02T23:44:01+05:30 IST