టీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీ స్టెప్నీ: విజయశాంతి
ABN , First Publish Date - 2021-11-26T22:35:22+05:30 IST
కేసీఆర్ కుటుంబంలో సీఎం స్థానం కోసం వార్ మొదలైందని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ
హైదరాబాద్: కేసీఆర్ కుటుంబంలో సీఎం స్థానం కోసం వార్ మొదలైందని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రగతి భవన్లో కుస్తీ ఫైటింగ్ జరుగుతోందన్నారు. కుటుంబ పంచాయితీతో కేసీఆర్ తల పట్టుకుంటున్నారని, కుటుంబ కొట్లాటల నుంచి రిలీఫ్ కోసమే కేసీఆర్ ఢిల్లీ పర్యటన చేస్తున్నారని ఎద్దేవాచేశారు. టీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీ స్టెప్నీ అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ను తన అవసరాల కోసం కేసీఆర్ వాడుకుంటున్నారని, టీఆర్ఎస్కు సీట్లు తక్కువ పడితే కాంగ్రెస్ పార్టీ సీట్లు వాడుకుంటారని ఆరోపించారు. టీఆర్ఎస్.. కాంగ్రెస్.. ఎంఐఎంలు ఒక్కటేనన్నారు. కేసీఆర్ మోసపు విధానాలు అవలంభిస్తున్నారని, తెలంగాణలో టీఆర్ఎస్కు భవిష్యత్ ఉండదని విజయశాంతి హెచ్చరించారు.